Rohit Sharma: నా జీవితంలో పల్లాలే ఎక్కువ
జీవితంలో ఎత్తుల కంటే పల్లాలే ఎక్కువ చూశానని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
దిల్లీ: జీవితంలో ఎత్తుల కంటే పల్లాలే ఎక్కువ చూశానని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఇంకొన్నేళ్లు క్రికెట్లో కొనసాగాలనుకుంటున్నానని చెప్పాడు. ‘‘క్రికెటర్గా నా ప్రయాణం అద్భుతం. భారత్ లాంటి దేశంలో జాతీయ జట్టుకు ఆడడం అంత తేలిక కాదు. నేను 17 ఏళ్లుగా ఆడుతున్నా. ఇంకొన్నేళ్లు ఆడాలనుకుంటున్నా’’ అని ఓ రేడియో ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ అన్నాడు. ‘‘నా జీవితంలో ఎత్తులకంటే పల్లాలనే ఎక్కువగా చూశా. నా గత అనుభవాల వల్లే ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నా. కెరీర్ ఆరంభించిన కొత్తలో సానుకూలాంశాలేమీ లేవు. జట్టుపై అంతగా సానుకూల మద్రను వేయలేకపోయా. నేను అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడేందుకు అర్హుడినేనా అని అనుకున్నా’’ అని చెప్పాడు. తాను కెప్టెనవుతానని ఎప్పుడూ అనుకోలేదని, దేశానికి నాయకత్వం వహించడం గొప్ప గౌరవమని రోహిత్ అన్నాడు. ‘‘నేను జట్టుకు నాయకత్వం వహించే రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. కానీ మంచి వాళ్లకు మంచే జరుగుతుందని జనం అంటుంటారు కదా’’ అని చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒంటిచేత్తో జట్టును గెలిపించే సత్తా రోహిత్ సొంతం: షకిబ్
టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు వార్మప్ మ్యాచుల్లో తమ శక్తియుక్తులను ప్రదర్శించుకొనేందుకు అన్ని జట్లూ ఎదురుచూస్తుంటాయి. భారత్ కూడా శనివారం బంగ్లాతో వార్మప్ ఆడనుంది. -
ఈ ప్లేయర్లు యమ డేంజర్ బాసూ..!
మొన్నటివరకు వారిని అభినందిస్తూ ఆనందించాం. ఇక ఇప్పటినుంచి వారు రాణించకపోతే బాగుండు అని అనుకుంటాం. ఇలాంటి విచిత్ర పరిస్థితిని టీ20 ప్రపంచ కప్ తీసుకొచ్చింది. -
తొలి మ్యాచ్ నాటికి.. మేం చేయాల్సిందదే: రోహిత్
వరల్డ్ కప్లో తమ సన్నద్ధతపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శనివారం వార్మప్ మ్యాచ్ నేపథ్యంలో ఐసీసీతో మాట్లాడాడు. -
ఆ ఫైనలిస్టుల్లో ఒక్కరూ లేరు.. అయినా అది భారత్కే వరం: వసీమ్ అక్రమ్
భారత జట్టు తరఫున టీ20 ప్రపంచ కప్లో ఆడాలనేది క్రికెటర్ల కల. కానీ, కొందరికే అవకాశం దక్కుతోంది. ఈసారి కూడా 15 మందితో కూడిన జట్టులో అభిమానులు ఆశించినట్లు కొందరికి ఛాన్స్ రాలేదు. -
‘మా దేశంలో నెపోటిజం స్థాయి ఇదీ’.. పాక్ క్రికెటర్ ఎంపికపై ఫ్యాన్స్ ఫైర్
వరల్డ్ కప్ కోసం ప్రకటించిన జట్టుపై పాకిస్థాన్ ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఘోరంగా విఫలమవుతున్న ఆజం ఖాన్ను ఎందుకు తీసుకున్నారనే ప్రశ్నలు తలెత్తాయి. -
ఈసారి వరల్డ్ కప్లో భారత్ రిస్క్ చేస్తోంది: ఆసీస్ మాజీ కెప్టెన్
పొట్టి కప్ కోసం భారత జట్టు సన్నాహాలను ప్రారంభించింది. జూన్ 1న బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్లో తలపడనుంది. ఇప్పటికే జట్టు సభ్యులందరూ ప్రాక్టీస్ను ముమ్మరం చేశారు. -
టీ20 ప్రపంచకప్కి భారత్ రెడీ.. ఫైనల్ 11 ఎవరైతే బాగుంటుంది? మీ జట్టేంటి?
Team India XI Poll For T20 World Cup 2024 I వెస్టిండీస్ - యూఎస్ఏ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్లో టీమ్ ఇండియా ఫైనల్ 11లో ఎవరు ఉండాలి? -
టీ20 ప్రపంచకప్.. ‘డిఫెండింగ్’ ఛాంపియన్స్ పరిస్థితేంటి?
ఐపీఎల్ తర్వాత క్రికెట్ అభిమానులను అలరించడానికి మెగా టోర్నీ సిద్ధమైంది. జూన్ 2 నుంచి యూఎస్ఏ - విండీస్ సంయుక్త ఆతిథ్యంలో టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. -
కప్పుతో ముగిస్తారా?
ఆ ఇద్దరు భారత క్రికెట్ జట్టు మూలస్తంభాలు. దాదాపు దశాబ్దన్నరగా టీమ్ఇండియా బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నారు. అత్యుత్తమ ప్రదర్శనతో దిగ్గజాలుగా ఎదిగారు. ఆ ఇద్దరి ఆటతీరు వేరు. వ్యక్తిత్వమూ వేరు. కానీ జట్టు విషయానికి వచ్చే సరికి విజయాల కోసం పోరాడటంలో వెనక్కి తగ్గరు. -
ఛాంపియన్ల అడ్డా
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్.. ఫార్మాట్తో సంబంధం లేకుండా అత్యుత్తమ ఆటతీరుతో దూసుకెళ్లే ఛాంపియన్ జట్లు ఇవి. టీ20ల్లో దూకుడు మంత్రంతో.. బాదుడే ఆయుధంగా సాగుతాయి. రెండు జట్లలోనూ అగ్రశ్రేణి ఆటగాళ్లకు కొదవలేదు. -
మూడో రౌండ్లో జకోవిచ్
టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ మూడో రౌండ్కు దూసుకెళ్లాడు. నాలుగో సీడ్ జ్వెరెవ్, అయిదో సీడ్ మెద్వెదెవ్ కూడా ముందంజ వేశారు. మహిళల సింగిల్స్లో రెండో సీడ్ సబలెంక, నాలుగో సీడ్ రిబకినా మూడో రౌండ్లోకి ప్రవేశించారు. -
మురికివాడల నుంచి ప్రపంచకప్కు
కనీస అవసరాలు తీర్చుకోవడానికి, నిత్యవసర వస్తువులు కొనుక్కోవడానికి రోజూ పోరాడాల్సిందే. చుట్టూ మురికివాడలే. శుద్ధమైన తాగునీరు దొరకదు. నాణ్యమైన వైద్యం అందదు. కుటుంబాన్ని పోషించడానికి సరైన ఉద్యోగమూ ఉండదు. -
గాయత్రి జోడీ సంచలనం
భారత డబుల్స్ స్టార్లు గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ సింగపూర్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో సంచలనం సృష్టించారు. ప్రపంచ రెండో ర్యాంకు జంటకు షాకిచ్చి ఈ జోడీ క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లింది. -
ప్రజ్ఞానంద అదరహో
భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద క్లాసికల్ ఫార్మాట్లో తొలిసారి ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ను ఓడించాడు. నార్వే చెస్ టోర్నమెంట్ మూడో రౌండ్లో 37 ఎత్తుల్లో గెలిచిన ప్రజ్ఞానంద.. 5.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో ఉన్నాడు. -
అదో భిన్నమైన అనుభూతి
భారత జెర్సీతో తిరిగి మైదానంలో అడుగుపెట్టడం భిన్నమైన అనుభూతినిస్తోందని వికెట్ కీపర్ రిషబ్ పంత్ అన్నాడు. 2022లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 15 నెలలు ఆటకు దూరంగా ఉన్న పంత్.. ఈ ఏడాది ఐపీఎల్లో పునరాగమనం చేశాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఫేస్బుక్లో లింక్ క్లిక్ చేసి రూ.34 లక్షలు పోగొట్టుకున్న బ్యాంకు ఉద్యోగి
-
సినిమా చూడకుండానే రివ్యూ ఇచ్చారు: విష్వక్ సేన్
-
వారి రాజీనామా నిర్ణయం అభినందనీయం: కేటీఆర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అదృశ్యమైన కోటా విద్యార్థి.. 23 రోజులు.. దేశమంతా చక్కర్లు కొట్టి!
-
ఆ విషయాలు నా పిల్లల నుంచే నేర్చుకున్నా.. మామా ఎర్త్ సీఈఓ